GNTR: రాజధాని నిర్మాణంలో భాగంగా మందడం గ్రామంలో నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ అమలును వేగవంతం చేసే దిశగా సీఆర్డీఏ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో లేఅవుట్లను తనిఖీ చేశారు. మ్యాప్ల ద్వారా అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితిగతులను అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు.