AKP: మాడుగుల శ్రీదేవి అమ్మవారి ఆలయం గర్భగుడి గోపుర శిఖర కలశ ప్రతిష్ఠాపన మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు గోమాత పూజ, గణపతి పూజ, కలశ ఊరేగింపు నిర్వహించారు. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు కలశ ప్రతిష్ఠా కార్యక్రమం జరగనుంది. అనంతరం అన్నసమారాధన ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు ఈ మహోత్సవాలను విజయవంతం చేయాలన్నారు.