TG: మావోయిస్టుల అణిచివేతపై వ్యూహరచన చేసేందుకు ఇవాళ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ అధికారులతో వీరు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు, సరిహద్దు భద్రత, ఉమ్మడి వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్రం నుంచి అందే సాంకేతిక సహకారం, నిధుల వినియోగంపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.