BHNG: చంద్రగ్రహణం నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు (కవాటబంధనం). రేపు ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం వంటి శుద్ధి కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ధర్మకర్త మానేపల్లి రామారావు తెలిపారు. భక్తులు ఈ విజ్ఞప్తిని గమనించాలని ఆయన కోరారు.