పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ మరోసారి టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కాడు. భారత్ సెమీస్ చేరదని వ్యాఖ్యానించి నవ్వులపాలైన అమీర్, ఇప్పుడు టీమిండియా ఫైనల్ చేరదని అన్నాడు. గతంలో భారత్ సెమీస్కు వెళ్లదని తాను వేసిన అంచనా కరెక్టే కానీ, సంజూ శాంసన్ ఒక్కడి వల్లే భారత్ గెలిచిందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో టీమిండియా విఫలమవుతుందని తెలిపాడు.