MLG: జిల్లా ఇంచర్ల రెవెన్యూ పరిధిలో గట్టమ్మ వద్ద 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న సర్వే నంబర్లు 28, 29లోని 12 ఎకరాల భూమిపై 10 మంది రైతులు ఇవాళ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయిల్ ఫామ్ కంపెనీ నిర్మాణ ప్రకటనతో భూమి కోల్పోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన 20 గుంటల భూమి, ఉద్యోగ అవకాశాలు అమలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.