NGKL: కల్వకుర్తి మండలం ఎలికట్టలో ఇందిరమ్మ ఇళ్లకు మంగళవారం మాజీ సర్పంచ్ రాకేశ్ శర్మ భూమి పూజ చేశారు. గ్రామంలో శాంక్షన్ అయిన ఇందిరమ్మ ఇండ్లను ప్రతి ఒక్కరూ కట్టుకొని పూర్తిచేయాలని లబ్ధిదారులకు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చి ఆర్థికంగా ప్రోత్సహిస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.