శ్రీకాకుళం: ఖరీఫ్ సీజన్లో సాగు కోసం రైతులు ఎరువుల కోసం పాట్లుపడుతున్నారు. యూరియా కొరతతో ఎరువులు దొరుకుతాయో లేదోనన్న భయంతో మంగళవారం లక్ష్మీ నర్సుపేట జంక్షన్లో ప్రైవేటు డీలర్ దుకాణం వద్ద రైతులు బారులు తీరారు. ప్రైవేటు డీలర్కు 660 బస్తాల ఎరువు వచ్చిందని రైతులందరికీ సరఫరా చేయడం జరుగుతుందని, ఆందోళన చెందవద్దని ఏవో సింహాచలం అన్నారు.