ఆర్ట్ డైరెక్గర్గా అడ్డాల చంటి పేరు తెలియని వాళ్లు చిత్ర పరిశ్రమలో ఉండరు. వందల సినిమాలకి, అందులోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకి ఆర్ట్ డైరెక్టర్గా చేసిన అడ్డాల చంటి తర్వాత రోజుల్లో నిర్మాతగా కూడా ఎదిగారు. ఉత్తమాభిరుచి, కథ పట్ల సరియైన అవగాహన, సినిమా నిర్మాణంలో నైపుణ్యంతో అడ్డాల చంటి హిట్ పిక్చర్స్నే నిర్మించారు. ఫేమస్ డిఓపి శ్రీనివాసరెడ్డితో కలసి సంయుక్తంగా ఫ్రెండ్లీ మూవీస్ పతాకాన్ని స్థాపించి, బాలకృష్ణ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లరి నరేష్, తరుణ్లాంటి హీరోలతో భారీ కమర్షియల్ చిత్రాలనే నిర్మించారు. కానీ ఇటీవల కొన్ని సంవత్సరాలుగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటూ వచ్చారు. అల్లు అర్జున్తో సినిమా చేయాల్సి ఉండగా, మరే కారణాలవల్లనో ఆ ప్రాజెక్టు అయితే కార్యరూపం దాల్చలేదు.
ఆయనైతే ఫిల్మ్ ప్రొడక్షన్కి దూరంగాఉన్నారు గానీ, చంటి కుమారుడు తెరంగేట్రం చేశారు. గుణశేఖర్ తనే నిర్మాతగా దర్శకత్వం వహించిన యుఫోరియా చిత్రంలో విలన్గా అడ్డాల పృధ్వీరాజ్ పరిచయం కాబోతున్నాడు. ఇంతక మునుపే పృధ్వీరాజ్ హీరోగా చేయాల్సిఉండగా ఆ చిత్రం కూడా కారణాంతరాల వల్ల తెర రూపం దాల్చలేదు. ప్రముఖ దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ డైరెక్టర్గా కూచిపూడివారి వీధిలొ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసిన తర్వాత ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.
అయితే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రపోజల్ తెరమీదకి వస్తున్నట్టుగా అడ్డాల చంటి తెలిపారు. పరిశ్రమలో ఎందరో వారసత్వాన్ని అందిపుచ్చుకుని ప్రేక్షకలోకాన్ని మెప్పించి, విజయపథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వాళ్ళ మార్గంలోనే అడ్డాల పృధ్వీరాజ్ కూడా ప్రేక్షక నీరాజనాలు విజయవంతంగా అందుకుని కెరీర్లో సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకెళ్తాడని ఆశిద్దాం. ఒడ్డూపొడుగు, యాక్టింగ్ పెరఫెక్టు ట్రయినింగ్, సూపర్ ఫిజికల్ ఫిట్నెస్లతో ఎంతో డిసిప్లిన్తో కృషి చేస్తున్నాడు పృధ్వీరాజ్. గుణశేఖర్ లాంటి అనుభవజ్ఞుడి చేతులమీదుగా ప్రేక్షకలోకానికి పరిచయం కావడం కూడా ఏ కొత్త నటుడికైనా ప్లస్ పాయంటే అవుతుంది, పైగా పృధ్వీరాజ్కి నటన పట్ల విపరీతమైన అభిరుచి, మమకారం ఉంది కాబట్టే హీరోగా మాత్రమే ఇంట్రడ్యూస్ అవుతానని మొండిగా కూర్చోకుండా విలన్ పాత్రకైనా సిద్ధపడ్డాడంటే అది నిజమైన యాక్టర్ నిఖార్సయిన లక్షణం. నటుడిగా ఎస్టాబ్లిష్ కావడానికి ఇంత కన్నా మంచి అవకాశం దొరకడం కూడా కష్టమే. సో.. విష్ హిమ్ ఆల్ ద బెస్ట్