ASF: జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ విద్యార్థులకు విద్యపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రేను కలిసి వినతి పత్రం అందజేశారు. ఏజెన్సీలోని విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.