VSP: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. విశాఖలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కుప్పంలో మహిళపై దాడులు చేస్తే హోంమంత్రి వీడియో కాల్ ద్వారా స్పందించడం దారుణమని విమర్శించారు. హోంమంత్రికి నేరుగా వెళ్లి మాట్లాడే తీరిక లేదా..? అని ప్రశ్నించారు.