MNCL: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆలిండియా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, ఉపాధ్యక్షురాలు పద్మ ఆరోపించారు. మంగళవారం మంచిర్యాలలో జరిగిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.