NRML: మొక్కజొన్న తోటకు విద్యుత్ వైర్ అనుసంధానించి ఒక వ్యక్తి మరణానికి కారణమైన దెగావత్ శంకర్కు నిర్మల్ జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, ₹2,000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. భూమేష్ విద్యుత్ షాక్తో మరణించిన ఘటనలో సాక్ష్యాల ఆధారంగా ఈ తీర్పు వెలువడింది. ఎస్పీ జానకి షర్మిల నేరస్తులకు శిక్ష తప్పదని, ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.