VSP: విశాఖ-పాడేరు మార్గంలోని గరికబంద చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు చెక్ చేశారు. ఈక్రమంలో గంజాయి పట్టుబడిందని ఎస్సై నారాయణరావు చెప్పారు. మన్యంలో గంజాయి కొనుగోలు చేసి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. నంద్యాల జిల్లా బేతంచర్లకు చెందిన నలుగురిని అరెస్టు చేశామని చెప్పారు. వారి నుంచి 6 కేజీలు గంజాయి, స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.