JGL: మెట్పల్లి పట్టణంలోని లక్ష్మి ప్రైవేట్ ఐటీఐలో ఉచిత షార్ట్టర్మ్ కోర్సులకు గానూ మంగళవారం నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ లవంగ రాజశేఖర్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (PMSGMB) పథకంలో భాగంగా వారం రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవారు 2రోజుల్లో తమ వివరాలను నేరుగా అందజేయాలని కోరారు.