MHBD: తొర్రూరు మండలం ఖానాపురం గ్రామానికి చెందిన దాసరి వెంకట్ రెడ్డి సాగు భూమి ఎస్సారెస్పీ డీబీఎం -57 కెనాల్ పక్కనే ఉంది. సాధారణంగా కెనాల్కు ఇరువైపులా రాకపోకలకు దారి ఉండాలి. కానీ ప్రస్తుతం ఒకవైపు మాత్రమే ఉంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. తన పొలానికి వెళ్లాలంటే కెనాల్ కాలువ దూకాల్సి వస్తుందన్నారు.