GNTR: మంగళగిరిలో సోమవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ పలు కీలక ప్రకటనలు చేశారు. సుమారు రూ.1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పేదలకు శాశ్వత నివేశన పట్టాలుగా ఇస్తున్నామన్నారు. రెండేళ్ల తరువాత లబ్ధిదారులకు ఆ భూములను విక్రయించుకునే హక్కు ఉంటుందని చెప్పారు. మంగళగిరిలో 100పడకల ఆసుపత్రికి 13న శంకుస్థాపన చేస్తామన్నారు.