CTR: బోయకొండ గంగమ్మకు భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. హుండీ ద్వారా ఏడాదికి రూ. 5.52 కోట్లు సమకూరినట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం వెల్లడించారు. గతేడాది కంటే ఇది రూ. 72 లక్షలు అధికమని చెప్పారు. అలాగే బంగారు, వెండి సైతం భారీగా సమకూరిందన్నారు. ఆలయ ఆదాయానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.