SKLM: సీతంపేట మండలం దుగ్గి గ్రామం లో పీఎమ్ జన్ మన్ పథకం ద్వారా రూ.8.లక్షల అంచనా విలువతో 10000 లీటర్ల సామర్ధ్యం గల వాటర్ ట్యాంక్, ఇంటి ఇంటికి మంజూరైన నీటి కుళాయిలుకు ఆదివారం పాలకొండ ఎమ్మెల్యే ఎన్.జయకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి శుభ్రమైన నీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.