ప్రకాశం: కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో దైవ సేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా మండల క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవులపై దాడులు అరికట్టాలంటూ వారు నినాదాలు చేశారు. ప్రవీణ్ పగడాల కేసులో న్యాయం జరగాలంటూ పలువురు నినదించారు. దర్యాప్తు సక్రమంగా జరగాలని కోరారు. నిజా నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు.