SRCL: ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలోని సీతారాముల ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ వేడుకల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాలువాతో ఆశీర్వచనం అందించి ప్రసాదం అందజేశారు.