AKB: నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం ఉత్తర్వాహిని వద్ద ఉన్న పాకలపాడు గురుదేవుల ఆశ్రమంలో పౌర్ణమి పూజలు మంగళవారం ఘనంగా జరిగాయి. వేదమంత్రాల నడుమ జరిగిన కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. పౌర్ణమి సందర్భంగా ఆశ్రమం భక్తులతో కిటకిటలాడింది.