కోనసీమ: రామచంద్రపురం పట్టణం, మండల పరిధిలోని ఓదూరు, నరసాపురపుపేట తదితర గ్రామాల్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. రూ.1.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.