NRML: ఫిర్యాదుదారులకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్నినిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఏడుగురు అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా తెలియజేయాలని సూచించారు.