PLD: నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలో రోడ్డు మార్జిన్, డ్రైన్లు, ఫుట్ పాత్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ జస్వంత్ రావు హెచ్చరించారు. సోమవారం వినుకొండ రోడ్డులోని ఆక్రమణలను జేసీబీతో తొలగించారు. ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని లేకుంటే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తామని హెచ్చరించారు.