పశ్చిమ బెంగాల్ హౌరాలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్త కిడ్నీని బలవంతంగా రూ.10 లక్షలకు అమ్మించి డబ్బు తన వద్దే ఉంచుకుంది. తన కూతురి చదువుకు ఉపయోగపడుతుందని చెప్పడంతో భర్త గుడ్డిగా నమ్మాడు. కానీ, ఆ మహిళ తన భర్తను నిలువునా ముంచి రాత్రికి రాత్రే ప్రియుడితో డబ్బు తీసుకొని పరారైంది. దీంతో భర్త పీఎస్లో ఫిర్యాదు చేశారు.