E.G: శరీరంపై స్పర్శ లేకపోవడం కుష్టు వ్యాధి లక్షణమని, ఈ లక్షణాలు కనిపించిన వారు, శరీరంపై వివిధ రకాల మచ్చలు ఉన్నవారు తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని పల్లంకుర్రు పీహెచ్సీ ఆరోగ్య విస్తరణాధికారి డీబీవీ ప్రసాద్ సూచించారు. కందికుప్పలో సర్పంచ్ వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కుష్టు రహిత మండలంగా చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు.