TG: హైదరాబాద్లోని మీర్పేట్ హత్య కేసులో నిందితుడిని రిమాండ్కు తరలించారు. నిందితుడు గురుమూర్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు గురుమూర్తిని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే, నిందితుడు గురుమూర్తి తన భార్య మాధవిని ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి చెరువులో పడేసిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే.