BHPL: జాతీయ రహదారి 353(సీ)పై మహాదేవపూర్ అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. కాటారం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు, అతడి బంధువైన మరో వ్యక్తితో కలిసి సూరారం వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి మైలురాయికి తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.