KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మార్చి 26న అంకురార్పణ, మార్చి 27న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈవో శ్రీ వీ. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సదుపాయాలు, పార్కింగ్, రవాణా, తదితర ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని సూచించారు.