MBNR: ఉదండాపూర్ ప్రాజెక్టు ముంపు బాధితులు మరోసారి ఆందోళన బాట పట్టారు. నష్టపరిహారం ఆరు నెలల్లో ఇప్పిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, తొమ్మిది నెలలు గడిచినా స్పందించకపోవడంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల్లో భారీ ధర్నా చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు అనుమతి కోరుతూ సీఐ కమలాకర్కు ఇవాళ వినతి పత్రం అందజేశారు.