TG: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు విద్యాశాఖ పొడిగించింది. 6వ తరగతిలో పూర్తిస్థాయి సీట్లను భర్తీ చేయనుండగా 7, 8, 9, 10వ తరగతులలో మిగిలి ఉన్న ఖాళీ సీట్లను ఈ ప్రవేశాల ద్వారా భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఆసక్తి గల విద్యార్థులు https://tgms.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.