MLG: మంగపేట మండల కేంద్రంలోని కోమటిపల్లి గ్రామం నుంచి నర్సాయిగూడెం గ్రామానికి వెళ్లే మార్గంలోని కోమటిపల్లి వాగుపై నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులు సోమవారం సర్వే నిర్వహించారు. వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండటంతో బ్రిడ్జి నిర్మాణం అవసరమైంది. సర్వే తర్వాత ఎస్టిమేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.