సత్యసాయి: మెళవాయి గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీటి సమస్యను మడకశిర MLA ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పరిష్కరించారు. గ్రామంలో నీటి ఎద్దడి దృష్ట్యా కొత్త బోరు వేయించి, మోటారు పంపు సెట్ బిగించడంతో పాటు పైపులైన్ పనులు పూర్తి చేయించారు. పీ. కుంచిటిగ వక్కలిగ కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.