TG: బాన్సువాడలో ఇటీవల జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. BJP జిల్లా కార్యాలయంలో బాధితుల కుటుంబ సభ్యులను బండి సంజయ్ పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇది పార్టీ పరంగా జరిగిన గొడవ కాదని, ఒక యువతి పట్ల అసభ్యంగా కొందరు ప్రవర్తించారని బాధితులు పేర్కొన్నారు. బాధితులను బెయిల్పై బయటకు తీసుకువస్తామని భరోసా ఇచ్చారు.