SRCL: వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఛైర్మన్ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ.. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలలో మున్సిపల్ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.