NRML: సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం గణితం పత్రం–1 ఏ, వృక్షశాస్త్రం, రాజకీయ శాస్త్రం పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 7,392 మంది విద్యార్థుల్లో 7,075 మంది హాజరై పరీక్ష రాయగా, 317 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి పరశురాం తెలిపారు.