KMR: ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలను సోమవారం ఇంటర్ బోర్డు అధికారులు తనిఖీ చేశారు. రాష్ట్ర పరిశీలకులు రమేశ్, అబ్దుల్ నబీ ఆకస్మికంగా సందర్శించి పరీక్షలు నిర్వహణ, గదుల ఏర్పాటు, విద్యార్థులు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రశ్నపత్రాల భద్రతపై ఆరా తీశారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.