TPT: కేవీబీ పురం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం 107 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. వ్యక్తుల ఫోటోలు లేకుండా ప్రభుత్వ రాజముద్రతో మాత్రమే పాసుపుస్తకాలు ముద్రించి అందిస్తున్నామని తెలిపారు. సూర్యనారాయణపురం (70 మంది), బక్కపోతుల కుంట (37 మంది) రైతులు లబ్ధి పొందారు.