E.G: సీతానగరం మండలం కాటవరంలో కొలువైయున్న శ్రీశ్రీశ్రీ పాశాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరారు.