KDP: తాను బీజేపీలో చేరకుండా అడ్డంకులు సృష్టించినా, రాష్ట్ర నాయకత్వం సహకారంతో అధిగమించానని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలిపారు. సోమవారం కమలాపురంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే బీజేపీ కండువా కప్పుకుని, అధికారికంగా పార్టీ నాయకుడిగా సమావేశం నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు.