SRPT: నడిగూడెం మండలం రత్నవరం MPPS పాఠశాలలో ‘ప్రీ-ప్రైమరీ’ (LKG, UKG) తరగతులను నేడు మండల విద్యాధికారి సత్యనారాయణ, సర్పంచ్ నాగేశ్వరరావు ప్రారంభించారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆట వస్తువులను, తరగతి గదులను వారు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆటపాటలకు ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు.