AKP: అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ సమస్యలపై అర్జీలను తీసుకొని వాటిని పరిశీలించి అర్జీదారులతో మాట్లాడుతున్నారు. ప్రజల సమర్పించిన అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.