ADB: అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకున్న నలుగురిపై కేసు నమోదు చేయడం జరిగిందని మావల CI కర్రె స్వామి శుక్రవారం తెలియజేశారు. నిందితులలో హమీద్, షరీఫ్ ను అరెస్ట్ చేయగా అంజుం, మెహరున్నీసా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కేఆర్కే కాలనీకి చెందిన పట్పెల్లీ లలితకు అందజేసిన ప్రభుత్వ ఇంటి స్థలాన్ని నకిలీ ధ్రువపత్రాలతో నిందితులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.