అన్నమయ్య: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం కోసం క్షేత్రస్థాయి పోరాటానికి శ్రీకారం చుట్టాలని వాల్మీకి రిజర్వేషన్ సేవా సంఘం (VRSS) రాష్ట్ర అధ్యక్షులు పొదల నరసింహులు పిలుపునిచ్చారు. ఆదివారం మదనపల్లిలో జరిగిన భవిష్యత్తు కార్యచరణ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.