MBNR: అడ్డాకుల మండల కేంద్రంలోని శివాంజనేయ షిరిడి సాయి ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ బి. దశరథ్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక వ్యాపారి బాలాజీ జితేందర్ తన సొంత ఖర్చుతో ఈ పనులు చేపట్టడం విశేషం. గ్రామ పెద్దలు జితేందరన్ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ రోడ్డు భక్తులకు సౌకర్యం కల్పిస్తుందని భావిస్తున్నారు.