WGL: “వనం వీడి జనంలోకి” కార్యక్రమంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన వారితో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో రాజకీయంగా ఆరంగేట్రం చేయాలని వారికి సూచనలు చేశారని సమాచారం. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.