శ్రీకాకుళం నగరంలో డయేరియా కట్టడి లక్ష్యంగా పారిశుధ్య నిర్వహణను జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. సోమవారం పారిశుధ్య నిర్వహణ పనులను , కార్మికుల హాజరును స్వయంగా పరిశీలించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలువల్లో ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా పూడికను పూర్తిస్థాయిలో తొలగించాలని ఆదేశించారు.