KMM: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ ఖమ్మం పర్యటనలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. రాజ్యాంగ పదవిలో ఉన్న తాను పర్యటనలో భాగంగా ఖమ్మం వస్తే తనను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ రిసీవ్ చేసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్కు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని ఆయన ఓ ప్రకటనలో మీడియాకు తెలియజేశారు.