ADB: బోథ్ మండలంలోని కన్గుట్ట గ్రామంలోని శబరిమాత ఆశ్రమ భక్తుల కోరిక మేరకు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తక్షణమే స్పందించి, షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ నిర్మాణ పనులు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు స్వామి, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, గంగమల్లు, తదితరులు పాల్గొన్నారు.